వేమగిరి మోషే కుటుంబాన్ని పరామర్శించిన పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: కొండవరం ఇంద్ర కాలనీకి చెందిన వేమగిరి మోషే ఇటీవల తన కుమారుడు వేమగిరి రమేష్ బైక్ మీద వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మోషే మరణించగా తన కుమారుడు గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వేమగిరి రమేష్ ను పరామర్శించి, కుటుంబానికి మనోధైర్యాన్ని అందిస్తూ రమేష్ యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని ఎక్స్రే, రిపోర్ట్ ను పరిశీలించి తగిన సలహాలను సూచనలు అందించడం జరిగింది. వారి కుటుంబ అవసరాల నిమిత్తం పిల్లా శ్రీధర్ ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం మరియు కొంతమేర ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోన రామకృష్ణ, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, వాసంశెట్టి రాజు, వేమగిరి చంద్ర రావు, సంఘం నూకరాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.