మొహర్రం ఉత్సవాల అన్నదానానికి బొలియశెట్టి శ్రీకాంత్ చేయూత

  • 250 కిలోల బియ్యం, 50 కిలోల కందిపప్పు, 15 కిలోల మంచి నూనె అందజేత

కొండపల్లి మున్సిపాలిటీ: కొండపల్లి పట్టణంలోని 8వ వార్డులో కొలువైన హజరత్ ఇమామె హుస్సేన్ కర్బల మొహర్రం ఉత్సవాల్లో భాగంగా హజరత్ జల్ జలే సాహెబ్ పంజా పీర్ల పండుగ శుభ సందర్భంగా జులై 27న జరిగే అన్న సమారాధనకు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ వితరణ గావించారు. మొహర్రం ఉత్సవాల కమిటీ పెద్దలకు బుధవారం 250 కిలోల బియ్యం, 50 కిలోల కందిపప్పు, 15 కిలోల మంచి నూనె అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పీర్ల పండుగను ప్రతి ఏటా ముస్లిం సోదరులు ఎంతో నిష్టగా జరుపుకుంటారన్నారు. కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు.