మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న పెండ్యాల శ్రీలత

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచన మేరకు.. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన.. జనసేన పార్టీ మంగళగిరి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అనంతపురం జిల్లా నుండి రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత హాజరై.. సమాజంలో స్త్రీల ప్రాముఖ్యత గురించి వివరించి.. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మహిళలకు రాజకీయాలలో పెద్దపీట వేశారని.. మహిళల హక్కుల పరిరక్షణకు, జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పద్మావతి, సంయుక్త కార్యదర్శులు జయమ్మ, అనురాధ, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.