మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట నియోజకవర్గం: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయము (యల్లటూరు భవన్)లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ అహింసావాదంతో ఎంతటి కఠిన లక్ష్యానైన్నా ఛేదించవచ్చని నిరూపించి.. వలసవాదుల చెరనుండి అఖండ భారతావనికి విముక్తి కలిగించి.. ప్రపంచానికి నూతన పోరాట ఒరవడిని నేర్పిన జాతిపిత మహాత్మా గాంధీ గారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివ ప్రసాద్, పత్తి నారాయణ, నారదాసు రామచంద్ర, తోట సురేష్, శంకర్ రాజు, మౌల, చక్రి తదితరులు పాల్గొన్నారు.