శ్రీరంగపట్నం మృతులకు శ్రద్ధాంజలి ఘటించిన బత్తుల దంపతులు

రజానగరం, ఇటీవల తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన ముగ్గురు కళాకారులు సూరిశెట్టి దుర్గారావు, ఆడారి బుల్లియ్య, భీశెట్టి వీరబాబు లకు శ్రీరంగపట్నంలో జరిగిన సంతాపసభలో మృతుల ఫోటోలకు పూలమాలలు వేసి, ఘననివాళులు పలికి, కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఓదార్చి వారికి మనోధైర్యం చెప్పి రాబోవు రోజుల్లో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చి మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దించిన రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత మేడిశెట్టి శివరాం, తన్నీరు తాతాజీ, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, నాతిపాం దొరబాబు, అరిగెల రామకృష్ణ, అడ్డాల దొరబాబు, నాయకులు, గ్రామస్తులు పాల్గొని నివాళులు అర్పించారు.