సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు త్రివిక్రమ అలంకారంలో స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీ మంత్రంతో సూర్య భగవానుడు దేదీప్యమానుడై వెలుగొందారు. సూర్యప్రభపై తిరుమలేశుడి దర్శనంతో ఆరోగ్యం, ఐశ్వర్య భాగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.