ఆదిపురుష్ గ్రాండ్ గా ప్రారంభం..

బాహుబలి చిత్రంతో సినీ లవర్స్ ను కట్టిపడేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ఆ తర్వాత సాహో చిత్రంతో అదిరిపోయే పాన్ హిట్ కొట్టాడు. హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ మూవీ నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మరో మూవీ, బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఆనందం నింపారు. రామాయణం నేపథ్యంలో తెరకెకక్కుతోన్న ‘ఆదిపురుష్‌’ లో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 02 న అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘ఆది పురుష్’ ఆరంభ్’ అంటూ టైటిల్ లోగోతో ట్వీట్ చేశాడు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ముంబైలో మొదలుపెట్టారు. ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్.