జనసేనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: డాక్టర్ కందుల

విశాఖ, జనసేన పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి, పోలీస్ బ్యారెక్స్ వద్దగల ఆటో స్టాండ్ డ్రైవర్లకు యూనిఫారాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఆటో స్టాండ్ లో ఆటో డ్రైవర్లకు ఆయన యూనిఫారాలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేక ఉందన్నారు. అమలు కానీ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత ప్రజలను నిండా ముంచిందన్నారు. కరెంట్ బిల్లులతోపాటు ఇంటి పన్నులు నిత్యవసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయి అన్నారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో త్రినాథ్, రఘు, బొగ్గు శ్యామ్, గాజుల శ్రీను, నాగేష్, సతీష్, అశోక్, రమేష్, శ్రవణ్, అరుణ, మంగ, అక్కమ్మ, వర, శ్రీదేవి, సీత, బొద్దా లక్ష్మి, జోతి, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.