అడుగడుగునా జననీరాజనాలతో ముందుకు సాగిన జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర
- జనం కోసం జనసేన.. మహా పాదయాత్ర 41వ రోజు
- పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి.. బత్తుల
రాజానగరం: జనం కోసం జనసేన.. మహా పాదయాత్ర 41వ రోజు కార్యక్రమం మంగళవారం రాత్రి కోరుకొండ మండలం, మధురపూడి గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో బాగంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామములో ఉన్న ప్రతి గడప ఎక్కుతూ.. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. రాష్ట్రాభివృద్ధి ఒక పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని.. అందరూ సమైక్యంగా జనసేన పార్టీకి ఈసారి పట్టం కట్టాలని.. ఈ అరాచక పాలన చేస్తున్న ప్రభుత్వానికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని అభ్యర్థిస్తూ.. జనసేన కరపత్రాలను పంచుతూ రాత్రి సమయంలో సైతం మధురపూడి గ్రామ ప్రజల ఆదరాభిమానులతో మహా పాదయాత్ర ముందుకు సాగింది . జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుల కొండయ్య, ఆకుల ముత్యాలు, కొనే రామకృష్ణ, నాందే ప్రసాద్, బడుగు వెంకటేష్, ఆకుల ప్రసాద్, మెడిశెట్టి వెంకటేశ్వరావు, చల్లభత్తుల రాంబాబు, తిరుమలనాధుని గంగబాబు, మేలిమి కృష్ణ, సోడాసాని వీరనగేష్, గణేసుల రాంబాబు, ఆకుల కృష్ణ, తోరం సురేంద్ర, బులా బాలకృష్ణ, దార నాగేశ్వరావు, ఆకుల రాముడు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-7.56.21-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-7.56.21-PM-1-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-7.56.22-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-7.56.22-PM-1-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-7.56.22-PM-2-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-7.56.23-PM-1024x682.jpeg)