పవన్ తోనే రాష్ట్రాభివృద్ధి.. రాయపురెడ్డి కృష్ణ

  • మాడుగుల జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మాడుగుల: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, మాడుగుల నియోజక వర్గ జనసేన పార్టీ నాయకులు రాయపు రెడ్డి కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలో ఘాట్ రోడ్ జంక్షన్ లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కృష్ణ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి వివిధ పార్టీల నుండి జనసేన లోకి వస్తున్నట్టు చెప్పారు, రాష్ట్రానికి మేలు జరగాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావాలన్నారు. అందుకోసం పార్టీ శ్రేణులు సమిష్టి కృషితో పని చేయాలని కోరారు. ప్రధానంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం సాగించే పవన్ కళ్యాణ్ కు రోజు రోజుకు ప్రజల్లో ఆధరణ పెరుగుతుందని తెలిపారు. ఇది చూసి ఓర్వలేక అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మ బొరని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.