పట్టణంలో వార్డుల అభివృద్ధిని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం: జనసేన నాయకులు

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్, ఆదేశాల మేరకు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు స్థానిక సాయి గణేష్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ లు మాట్లాడుతూ కాలనీలో స్థానికంగా ఎన్నో కుటుంబాలు నివసిస్తున్న సాయి గణేష్ కాలనీ అభివృద్ధికి నోచుకొక పోవడం రాష్ట్ర ప్రభుత్వం మరియు మునిసిపల్ అధికారుల వైఫల్యం అని గతంలో కన్నా మూడు రెట్లు ఇంటి పన్ను నీటి పన్ను వసూలు చేస్తున్నా అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఎలా అని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు సాయి గణేష్ కాలనీలో ఉన్న డ్రైనేజీ రోడ్ల సమస్యలపై దిష్టి సారించి పరిష్కారం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరణం రవి, షబ్బీర్, రషీద్, బాలు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.