జనసేన పార్టీపై దుష్ట ప్రచారాలు మానండి పొత్తులపై పూర్తి నిర్ణయం అధినాయకుడిదే

జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం జనసేన పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చల్లా రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో పొత్తులుకు సంబంధించిన వార్తలు ఏవి కూడా వాస్తవాలు కావని ఇంకా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వని కారణంగా సోషల్ మీడియాలో వస్తున్న కధనాలు ఎవరూ నమ్మవద్దని అదే విధంగా మీడియా వారు కూడా ఇలాంటి పుకార్లను ఆధారంగా తమ ఛానల్ మరియు పేపర్లో ఎలాంటి కధనాలు దయచేసి ప్రచురించవద్దని మీడియా వారికి విన్నవించటం జరిగింది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న అయన ఆజ్ఞను శిరసావహిస్తాం అని అటువంటి వార్త ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే చెప్తామని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు పువ్వల శ్రీదేవి, వేముల దేవి, బత్తుల సత్యవతి పాల్గొన్నారు.