స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్..

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో గురువారం జరిగిన జనసేన పార్టీ యువశక్తి సభా ప్రాంగణంలో జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో జీవీఎంసీ 85వ వార్డులో చేరిన ఉక్కు నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ అని 50 అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు మరియు ఉక్కు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసి, యువతను ఉక్కు ఉద్యమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేసారు. రానున్న రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఈ ఉక్కు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చేలా చేసి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని తెలియజేశారు.