పవన్ సతీమణిపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • విశాఖ జనసేన వీరమహిళలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజీనావా పై కొంత మంది వైసీపి నాయకులు, కార్యకర్తలు అసబ్య పదజాలాన్ని వాడడం జరిగింది, అలాగే కొన్ని యు ట్యూబ్ చానల్లు కూడా అబద్దపు ప్రచారాలు చేయడం జరుగుతుంది. పార్టీ పెద్దల ఆదేశం ప్రకారం ఈ ఘటనను ఖండించిన విశాఖ వీరమహిళలు శనివారం పోలీస్ బారెక్స్ వద్ద గల కమీషనర్ ఆఫీసులో కమీషనర్ కు వైసీపి వారు మరియు యు ట్యూబ్ చానల్స్ వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఒక లేఖను అందచేయటం జరుగింది. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, ఉత్తరాంధ్ర ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్స్ సారణి, త్రివేణి, లక్ష్మీ, కిరణ్ మరియు ప్రషాంతి రాష్ట్ర కార్యదర్శి, కళావతి లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ, రేవతి విశాఖ లీగల్ సెల్ ప్రెసిడెంట్, భీమిలి భువనేశ్వరి, అనురాదా, త్రివేణ, గాజువాక షాలిని, పెందుర్తి పార్వతి, తూర్పు కళా, రాజేస్వరీ, సంద్య, పోతు ప్రసాద్, సాయుబాబా, రవి, ఉత్తరం దుర్గ, నాగమణ, లక్ష్మి, ధక్షిణం మంగ, మూగి శ్రీనివాస్ అండ్ టీం, వివిధ నియోజకవర్గాల జనసేనికులు పాల్గొన్నారు.