జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం

విజయనగరం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతి వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్దనున్న కార్యాలయంలో గురాన అయ్యలు నిర్వహించారు. ముందుగా నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి జనసేన నాయకులు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకరమైన ఇండియన్ సివిల్ సర్వీసును తృణప్రాయంగా వదిలి భరతమాత ద్రాస్యశృంఖాలను విడిపించుటకై స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గున్న దేశభక్తుడు నేతాజీ అని, జయంతి కలిగి, వర్ధంతి లేని మహనీయులు సుభాష్ చంద్రబోస్ అని ఆయన ధైర్యసాహసాలను అభివర్ణించారు. అటువంటి మహనీయులు నేతాజీని ప్రతీ భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి కాటం అశ్విని, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), యువ నాయకులు ఎంటి రాజేష్, లోపింటి కళ్యాణ్, పవన్ కుమార్, మహేష్, శ్రీనివాస్, పట్నాయక్ పాల్గొన్నారు.