జనసేనాని పవన్ను కలిసిన సుదీప్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్తో ప్రముఖ కన్నడ హీరో సుదీప్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తమై హైదరాబాదులో ఉన్న కిచ్చ సుదీప్ తన సహ నటుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సుదీప్కు పవన్ మొక్కలు అందజేశారు. అనంతరం వారిద్దరూ అన్లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగులకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కిచ్చ సుదీప్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో షూటింగ్స్ పరిస్థితిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం.
కర్ణాటకలో సుదీప్ బీజేపీకి సపోర్ట్గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అండగా నిలిచి సుదీప్ ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లో బిజేపీకి సపోర్ట్ చేస్తున్న జనసేన అధినేతని సుదీప్ ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న రోజుల్లో బిజేపీకి ఎలా అండగా నిలవాలన్నదానిపై ఈ హీరోల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కానీ పీఆర్ టీమ్ మాత్రం సుదీప్ మర్యాద పూర్వకంగానే జనసేన అధినేతని కలిశారని చెబుతోంది. సుమారు గంట సేపు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
సినిమాల గురించి మాత్రమే వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని, కోవిడ్ నిబంధనలను అనుసరించి చేస్తున్న షూటింగ్ల గురించి మాట్లాడుకున్నారని వర్తమాన, సామాజిక అంశాలపై తమ ఆలోచనల్ని పవన్, సుదీప్ పంచుకున్నారని మాత్రమే మీడియాకు వెల్లడించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2020/10/image-6.png)