సన్‌రైజర్స్‌ విజయం

ఐపీఎల్-2020లో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. 162 పరుగుల స్కోరును కాపాడుకుని విజయకేతనం ఎగురవేసింది. సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో రాణించడంతో సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించినా గెలుపును అందుకుంది. హైదరాబాద్ గెలుపులో తొలుత బెయిర్ స్టో(48 బంతుల్లో 53)తో మెరవగా.. వార్నర్(33 బంతుల్లో 45), విలియమ్సన్(26 బంతుల్లో 41) రాణించారు. తరువాత బౌలింగ్‌లో రషీద్ ఖాన్ స్పిన్‌తో మాయ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. దీంతో టోర్నీలో ఢిల్లీ తొలి ఓటమి చవి చూసింది.

కాగా, హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న ఢిల్లీ ఆశలు తీరలేదు. ఢిల్లీ ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్ (34/31 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌(28/27 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), హెట్‌మెయిర్‌(21/12 బంతుల్లో 2 సిక్స్‌లు)లు మాత్రమే మోస్తరుగా ఆడటంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.