యాదాద్రీశునికి స్వాతి నక్షత్ర పూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి బాలలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహ మూర్తి, ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.