వెండితెరపై ‘భగవద్గీత సాక్షిగా’ ప్రమాణం

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా గోపాల్‌ అనే ఓ కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ఇందుకు తగ్గ సన్నాహాలు మొదలైపోయాయని ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ టాక్‌ నడుస్తుంది.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది.  ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంచితే… ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు సాయిధరమ్‌ తేజ్‌. తర్వాత అలాగే దేవ కట్టా డైరెక్ట్‌ చేయనున్న సినిమాలో కూడా హీరోగా నటించనున్నారు.