తెలుగు దేశంలో చేరిన సయ్యద్ చాంద్

యువజన కాంగ్రెస్ నేత సయ్యద్ చాంద్ తెలుగు దేశం పార్టీలో చేరారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చాంద్ మాట్లాడుతూ దశ, దిశ లేని ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చే సమర్ధత చంద్రబాబుతోనే సాధ్యం అని బలమైన విశ్వాసంతో పార్టీ లో చేరడం జరిగిందన్నారు.
కూటమి అభ్యర్థుల గెలుపుకు తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తనకు సహకరించిన గల్లా మాధవి, నసీర్ అహ్మద్, సుఖవాసి శ్రీనివాస్, సీతయ్య, సవరం రోహిత్, ఆళ్ళ హరికి సయ్యద్ చాంద్ కృత్ఞతలు తెలిపారు.