తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ముడుచక్రాల సైకిల్ పంపిణీ

జగ్గంపేట నియోజకవర్గ జనసేనపార్టీ కార్యాలయం వద్ద గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంకి చెందిన దిండి జగదీశ్వరి అనే దివ్యాంగ సోదరికి కొత్తపల్లి గ్రామ జనసేన వీర మహిళలు ప్రోత్సాహంతో తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ మరియు నియోజకవర్గ నాయకులు పాలిశెట్టి సతీష్ చేతులమీదుగా మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఆమె గ్రామంలో తిరుగుతూ ఆమె యొక్క రోజు వారి దినచర్యలు చక్కబెట్టుకోవడానికి ఈ సైకిలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె స్వతహాగా ఎక్కడికైనా వెళ్లడానికి గ్రామంలో అవసరాల నిమిత్తం తిరగడం కోసం దీన్ని అందజేయడం జరిగింది. దీనికి సహకరించిన తదేకం ఫౌండేషన్ వారికి జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీరమహిళలు చల్లా రాజ్యలక్ష్మి, పువ్వల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.