తాడేపల్లిగూడెం జనసేన-తెలుగుదేశం-బీజేపీ ఆత్మీయ సమావేశం

తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం, పడమర విప్పర్రు గ్రామంలో జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బుధవారం జనసేన-తెలుగుదేశం-బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అభ్యర్థి, జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం ఇంచార్జ్ వలవల బాబ్జి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విప్పర్రు గ్రామ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ మాట్లాడుతూ కలిసి కష్టపడి పనిచేసి బొలిశెట్టి శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గెలిచిన ఆరు నెలల్లో రోడ్డు వేయిస్తానని, మంచినీటి చెరువుకి ఆనుకొనిని ఉన్న డంపింగ్ యార్డ్ ని మారుస్తానని, అన్నిరకాలుగా విప్పర్రు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.