జనసేన కార్యకర్తను పరామర్శించిన తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం: సైదాపూర్ మండలంలోని జనసేన పార్టీ కార్యకర్త పొడిశెట్టి నవీన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆదివారం నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ పరామర్శించారు‌. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని, కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల అధ్యక్షుడు పొడిశెట్టి విజయ్, ఉపాధ్యక్షుడు రుద్రారపు అరుణ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బత్తుల శ్రీను, సోషల్ మీడియా సెక్రెటరీ మొలుగూరి అరవింద్, కనగండ్ల శ్రీకాంత్, అఖిల్, గూళ్ళ హరీష్ తదితరులు పాల్గొన్నారు.