వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టండి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక పట్టణంలో వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పట్టణంలో రోజు రోజుకు వీధి కుక్కల బెడద పెరిగిపోతోందని, ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయని అన్నారు. వీటి బెడదను అరికట్టేందుకు తొందరగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, సోషల్ మీడియా సెక్రటరీ రెడ్డి గోపినాథ్, మోరె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.