తమిళ సినీహీరోయిన్లు సంయమనం పాటించాలి

  • జనసేన పార్టీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి భునపల్లి మునస్వామి

తిరుపతి: గత పదిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామలను దృష్టిలో పెట్టుకొని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోని మంత్రి రోజా గారి విషయంలో మాట్లాడాలని తమిళ సినీతరాలకు తిరుపతి జనసేనపార్టీ నగర ప్రధాన కార్యదర్శి భునపల్లి మునస్వామి కోరారు. ఈ సందర్బంగా భునపల్లిమునస్వామి మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల ప్రతిఒక్కరు గౌరవభావంతో మెలగాలని అందులో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటివారు మరింత బాధ్యతగా ఉండాలి. టూరిజం శాఖ మంత్రి రోజాగారిపై తెలుగుదేశం నాయకులు బండారు సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ సబబుకాదు. కానీ అంతకు ముందు రోజా గారు ఒక మహిళా నాయకురాలని మరచిపోయి ప్రతిపక్షాల కుటుంబసభ్యులపై పై చేసిన అనుచితవ్యాఖ్యలు వల్ల వారు కూడా ఇదే తరహాలో ప్రవర్తించారు. ఈ విషయం తమిళ సినీహీరోయిన్లు తెలుసుకొని మాట్లాడిఉంటే మంచిది. లేకపోతే రాజకీయాప్రభావం సినితారలపై పడి వారుకూడా అనుచితవ్యాఖ్యలకు గురైయే ఆస్కారం ఉంది.ఇదే సినీ రంగానికి చెందిన ముఖ్యమైన ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తమిళ సినీతారలు స్పందించలేదు. ఇప్పుడు మాత్రం తమిళ డైరెక్టర్ అయిన ఆర్ కె సెల్వమణి సతీమణి అయిన మంత్రి రోజా గారిని వెనకేసుకుని తమిళ సినీహీరోయిన్లు మాట్లాడడం సరైనది కాదని అన్నారు.