దసరా నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొన్న తంగెళ్ల శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గం: దసరా నవరాత్రుల సందర్భంగా పిఠాపురం టౌన్ లో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం రెల్లి వీధి అగ్రహారం, పిఠాపురం 1వ వర్డ్, అల్లం కిషోర్, పి ఎస్ ఎన్ మూర్తి జనసేన వర్కింగ్ టీమ్ ఆహ్వానం మేరకు సోమవారం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విచ్చేసి అమ్మ పూజ అనంతరం 5000/- అమ్మవారికి దసరా నవరాత్రులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రెల్లీ సోదరలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, కర్రి కాశీ, అల్లం కిషోర్, పెంకే జగదీష్, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, తోట సతీష్, కోలా దుర్గ, ముప్పన రత్నం, పిల్లా రమ్యజ్యోతి, పబ్బిరెడ్డి ప్రసాద్ నామ శ్రీకాంత్, మరియు పిఎస్ఎన్ మూర్తి, నాయకులు, జనసైనికులు, ఆధార్ కమిటీ సభ్యులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.