గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ‘తారా ఆర్ట్స్ అకాడమీ’

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు ఏ మంచి సందర్భం వచ్చిన పాల్గొని మొక్కలు నాటే చైతన్యాన్ని తీసుకువస్తుంది. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా తారా ఆర్ట్స్ అకాడమీ వారు అండమాన్ లో నిర్వహించిన సంస్కృతి కళోఉత్సవం పోర్ట్ బ్లెయిర్ 2021 సందర్భంగా మొక్కలు నాటారు. ఈ విషయాన్ని ఈరోజు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడ కోసం కృషి చేస్తున్నారని అభినందించి సంస్థ తరుపున ఆయనకు జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రాజేష్, రోజా రమణి నటి డాన్సర్, లీలా రాజ్, జూపల్లి మంజులా రావు, మేజర్ జయసుధ తదితరులు పాల్గొన్నారు. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి నందుకు తారా ఆర్ట్స్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేసారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.