క్రియాశీలక సభ్యునికి భీమా చెక్కును అందచేసిన టిసి.వరుణ్

అనంతపురం, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం అనంతపురంలోని నారాయణపురం పంచాయతీలోని అల్లూరి సీతారామరాజు (ASR) నగరానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ మాదాసు అశోక్ స్వగృహానికి వెళ్లి ప్రమాదవశాత్తు గాయపడిన వారిని, వారి కుటుంబీకులను పరామర్శించి శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వారికి వర్తించే మెడికల్ ఇన్సూరెన్స్ (₹18,466/-) చెక్కును జిల్లా అధ్యక్షులు శ్రీ టిసి.వరుణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.