బంద్ లో పాల్గొన్న టీడీపీ, జనసేన
పాయకరావుపేట, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ కు నిరసనగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్ లో జనసేన పాల్గొంది. పవన్ ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి జనసేన నేతలు శాంతియుత నిరసనలో పాల్గొన్నారు. కోటవురట్ల మండల కేంద్రంలో తహసిల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లి టీడీపీ, జనసేన నేతలు సంయుక్తంగా బంద్ లో పాల్గొన్నారు. జనసేన పార్టీ కోటవురట్ల మండల టౌన్ అధ్యక్షుడు బద్రి కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలపడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-16.09.26-1024x768.jpeg)