ఉపాధ్యాయ సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలి: జగ్గయ్యపేట జనసేన

జగ్గయ్యపేట, రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పారు. తాను ముఖ్యమంత్రి అయితే వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని, పిఆర్సి సవరణ ఉంటుందని, డిఏ లను సకాలంలో చెల్లిస్తానని నమ్మబలికి, తీరా ముఖ్యమంత్రి అయ్యాక తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగులను, ఉద్యోగ సంఘ నాయకులను అక్రమ అరెస్టులతో గొంతు నొక్కుతున్నారు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అరెస్టు చేసిన ఉపాధ్యాయ నాయకులను వెంటనే విడుదల చేయాలి, వారి న్యాయమైన కోర్కెలను తీర్చాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తరుపున జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని… ఉద్యోగులకు, ఉద్యోగ సంఘ నాయకులకు వారి పోరాటానికి జనసేన పార్టీ తరుపున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నామని జగ్గయ్యపేట జనసేన నాయకులు, కృష్ణా జిల్లా జనసేన పార్టీ సం యుక్త కార్యదర్శి ఏమని కిషోర్ కుమార్ అన్నారు.