టీం పిడికిలి వారి కౌలు రైతు భరోసా యాత్ర గోడ పత్రికలు ఆవిష్కరించిన పిడుగురాళ్ల జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా యాత్ర గోడ పత్రికలను పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామశెట్టి రమేష్ పార్టీ ఆఫీసు నందు విడుదల చేశారు.. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే నిమిత్తం ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయంతో పాటు వారికి నేనున్నాను అంటూ.. భరోసా కల్పిస్తున్నారు అని అధికారంలో లేకపోయినా కోట్ల రూపాయలు సొంత డబ్బుతో నిత్యం ప్రజల కోసం తపించే పవన్ కళ్యాణ్ గారిని రానున్న రోజుల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భయ్యవరపు రమేష్, పెడకొలిమి కిరణ్ కుమార్, గుర్రం రామకోటేశ్వరరావు, బేతంచెర్ల ప్రసాద్, నాగేశ్వరరావు, పరమేష్, అంబటి సాయి, మల్లెల రామాంజి, షేక్ వలి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.