- ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేద్దాం- గూడూరు నియోజకవర్గం పిఓసి కె.మోహన్
గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తీగల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని, జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చెయ్యాలని కోరారు. పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనసైనికులు సభకు తరలి వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గూడూరు పిఓసి మోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీరమహిళలు అందరూ హాజరై కలిసికట్టుగా పండగలా జరుపుకుందామన్నారు. అనంతరం ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శులు వంశీ కృష్ణ, కుమార్, కార్యదర్శులు ఉప్పు సాయికిరణ్, పెంచలయ్య, సుమన్, ప్రవీణ్, మురళి, శివ, భరత్, గురు, తేజ, రాజు, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment