నాదెండ్లను కలిసిన టెక్కలి జనసేన నాయకులు

టెక్కలి: పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను టెక్కలి నియోజకవర్గం జనసేన నాయకులు సుధీర్ మెడిబోయిన, పల్లి కోటేశ్వర రావు, పూర్ణ చంద్ర, రాం ప్రసాద్, చందు, ప్రసాద్, పవన్, ఎల్. ప్రసాద్, శ్రీను, పవన్ కళ్యాణ్, షణ్ముఖ, జనార్దన్ గౌరవప్రదంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై మనోహర్ కు వినతి పత్రాన్ని అందజేసి, పార్టీ బలోపేతం కోసం వారు చేస్తున్న పార్టీ కార్యక్రమాల గురించి వివరించి, నాదెండ్లను సన్మానించారు.