హైదరాబాద్, 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి మరియు తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో మాదాపూర్ ఆఫీస్ లో తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి రామ్ తాళ్లూరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, కూకట్పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్, రాష్ట్ర వీరమహిళా అధ్యక్షురాలు ఎం కావ్య, ప్రధాన కార్యదర్శి శిరీష, ఉమ్మడి ఆదిలాబాద్ ఇంచార్జి సైదాల శ్రీనివాస్, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి నిహారిక తదితర నాయకులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment