ప్రమాదంలో గాయపడిన క్రియాశీల సభ్యునికి భీమా చెక్ అందజేసిన తెలంగాణా జనసేన

గ్రేటర్ హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంకు చెందిన పార్టీ క్రియాశీల సభ్యుడు విసాయి రాము ప్రమాదంలో గాయపడ్డారు. క్రియాశీలక సభ్యులకు వర్తించే మెడికల్ ఇన్సూరెన్స్ రూ.14667 చెక్ ను జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబద్ జనసేన పార్టీ అధ్యక్షులు రాధారం రాజలింగం లు అందజేజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.