తెలంగాణ జనసేన రాష్ట్ర స్థాయి సమావేశం

తెలంగాణ, హైదరాబాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం తెలంగాణ జనసేన రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన-బిజెపి పొత్తులో భాగంగా జనసేన తరపున పోటీ చేయనున్న అభ్యర్థులు ఎవరికి వచ్చినా పోటీకి సిద్దం కావాలని పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు తాళ్లూరి రామ్, రాధారం రాజలింగం వెల్లడించారు. ఈ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్వరలో స్వయంగా ప్రకటిస్తారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులకు సూచనలు చేశారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం పార్టీ ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఇంచార్జీలు, నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.