భారత్ బంద్‌కు తెలంగాణ ఆర్టీసీకార్మిక సంఘాల మద్దతు

కేంద్రం  అమలులోకి తెచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేసుకిస్తూ రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరసనలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు రైతులు. భారత్ బంద్ కు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నాయి. రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా, ఉద్యోగ, ట్రాన్‌ఫోర్టు సంఘాలు మద్దతు తెలిపారు. తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 3 గంటలవరకు రోడ్డెక్కే పరిస్థితులు కనిపించడంలేదు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు సోమవారం రాత్రి యధావిధిగా బయలు దేరాయి.. మంగళవారం ఉదయం 7 గంటలకు నగరానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రైతులు చేస్తున్న బంద్‌కు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు బంద్‌ చేయనున్నట్లు ఆటో డ్రైవర్స్‌ యూనియన్ల ఐకాస ప్రకటించింది.