శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం మరియు జనసేన పిలుపు

విజయనగరం, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు, గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలం, గంట్యాడ గ్రామం కెపిఎన్ బీఈడీ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని టిడిపి ఇన్చార్జి క్.ఎ.నాయుడు, జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రాపు సురేష్ పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు నాయకులు, జనసైనికులు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, మండల అధ్యక్షులు భాస్కర్ నాయుడు, వంశీ, కొండపల్లి పైడితల్లి నాయుడు, రొంగలి కృష్ణ, అల్లు చాణిక్య, వేమలి చైత్యన బాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.