తాడేపల్లి రైల్వే ఇళ్ల నిర్వాసితులకు అండగా నిలిచిన జనసేన

తాడేపల్లి పట్టణంలోని ఇందిరా నగర్ దగ్గర గల 800 గృహాలను తొలగించాలని రైల్వే అధికారులు కోరడంతో దాదాపు 1500 కుటుంబాలు ఈ రోజున దీక్ష చేపట్టడం జరిగింది.

జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొని దీక్షకు సంఘీభావం తెలియ చేసి పేదలకు పక్కా ఇళ్లను కట్టించి ఇచ్చేంతవరకు గృహాలను తొలగించటానికి వీలు లేదని బాధితుల తరపున న్యాయ పోరాటానికి పూర్తిగా అండగా ఉంటామని తెలియజేయడం మరియు దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, శెట్టి రామకృష్ణ, కట్టెపోగు నవీన్ కుమార్, గంజి రమేష్, తంబి, శ్యామ్, సారధి తదితర జనసైనికులు పాల్గొన్నారు.