జిల్లాల విభజనపై ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణను కలిసిన తాళ్ళరేవు జేఏసి

ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న తాళ్ళరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో చేర్చాలని మరియు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ చేర్చిన తాళ్ళరేవు మండలాన్ని కాకినాడ రెవిన్యూ డివిజన్ లో చేర్చాలని కోరుతూ తాళ్ళరేవు మండల జేఏసి సభ్యులు జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు జనసేనపార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషిచేస్తానని పితాని బాలకృష్ణ వారికి హామీ ఇవ్వటం జరిగింది.