దేవి నవరాత్రుల అన్నసంతర్పణలో పాల్గొన్న తంగెళ్ళ శ్రీనివాసు, జ్యోతులశ్రీనివాసు

పిఠాపురం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామం పల్లపువీధిలో మహాన్నదాన కార్యక్రమాన్ని దేవి నవరాత్రులు సందర్భంగా కనకదుర్గ మండపం కమిటి వారు ఆదివారం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినాయక నవరాత్రుల కమిటీ వారు, జనసేన నాయకుల ఆహ్వానం మేరకు ముఖ్యాతిధిగా జనసేన పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, జనసేన సీనియర్ నాయకులు నల్లం వాసు(బుల్లెట్ వాసు) జ్యోతుల శ్రీనివాసు కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని అన్నసంతర్పణ వడ్డిన కార్యక్రమంలో పాల్గొని అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదేపల్లి శ్రీనివాసు, బుద్దాల చంటి, బుద్దాల గంగాధర్, కొడవలి నాగేశ్వరరావు, మేడిబోయిన సత్యనారాయణ, మొగిలి శ్రీను గొల్లపల్లి గంగ, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, సాధనాల చంటిరాం, శాఖ సురేష్, యింటి దొరబాబు, కంద శ్రీను, కొప్పుల చక్రధర, కొప్పన రమేష్, డి. బుల్లిదోర, జ్యోతుల శివశంకర్, కొటికలపూడి గంగాధర్, పెద్దింటి శివ, జ్యోతుల గోపి, ఆలయ కమిటీ ఇంటి బుజ్జి, మేడిబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.