- ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య
గుంటూరు ఛానల్ విస్తరణ చేయాలని ధృడ సంకల్పంతోటి 2025-2026 సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ లో నిధులను తీసుకురావటంలో కృషి చేసిన గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్లె రామాంజనేయులుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆదివారం నాడు గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులు ఉద్యమాలు, నిరసన దీక్షలు, ఎన్నో రకాలుగా పోరాటాలు చేసారు. అయినా కానీ రైతులను అణచివేసి ఉద్యమాన్ని నీరు గార్చాలని రైతులను పలురకాలుగా ఇబ్బందులకు గత పాలకులు గురి చేసినారని అయన తెలిపారు. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఛానల్ విస్తరణకు, భూసేకరణకు చర్యలు తీసుకుంటామని పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యుడు వాగ్దానం చేసారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ లో ఛానల్ విస్తరణకు 100 కోట్ల, భూసేకరణ కోసం 300 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించిన ఆపరభగిరధులైన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు బూర్లె రామాంజనేయులుకునా ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఈ ఛానెల్ ద్వారా సుమారుగా 50 వేల ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాల ప్రజలకు త్రాగునీరు ఆందుతుందని వెంకటరత్తయ్య అన్నారు. ఈ ఛానల్ పొడిగింపునకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల రామానాయుడులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఇందు కోసం నిరంతరం ఎండనక, వాననక కష్టపడిన రైతులకు, మహిళలకు నా అభినందనలు తెలుపుతున్నాని ఉప్పు వెంకటరత్తయ్య తెయజేశారు.
Share this content:
Post Comment