రైతులకు బాసటగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10 ప్రాంతాల్లో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీజీఈసీఎల్ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో టెండర్ డాక్యుమెంట్ల జ్యుడీషియల్ ప్రివ్యూ ఉంచినట్లు చెప్పింది. జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం తర్వాత టెండర్లు నిర్వహిస్తామని ఏపీజీఈసీఎల్‌ స్పష్టం చేసింది. అయితే, వ్యవసాయ, బీడు భూముల్లో సౌర విద్యత్ కేంద్రాల ఏర్పాటను ప్రోత్సాహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం కింద రైతులు సొంతంగా వారి భూముల్లో విద్యుత్ ఉత్పత్తిని పోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తుంది.