విలేకరిపై దాడి అమానుషం

ఉరవకొండ: ఆదివారం రాప్తాడులో అధికార వై.సీ.పి. పార్టీ ఏర్పాటు చేసిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీ కృష్ణపై వై సీ పీ అల్లరి మూకలు చేసిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని మండల జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై బెలుగుప్ప పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని ఏ.ఎస్సై దేవదాసుకు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్, తిప్పేస్వామి అందజేశారు. అనంతరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్ మాట్లాడుతూ జర్నలిస్టులపై అధికార పార్టీ చేస్తున్న దాడులు చాలా హేయమైన చర్య అని మొన్న ఉరవకొండ, నేడు రాప్తాడులో కూడా ఇలాగే జర్నలిస్టులపై, అధికార పార్టీ అల్లరి మూకలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఇలా భౌతికదాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.