గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన గాదె

రేపల్లి నియోజకవర్గం, నగరం మండలం, పూడివడా గ్రామానికి చెందిన జనసైనికుడు మువ్వ తరుణ్ రాజ్ మని ఇటీవల రోడ్డు ప్రమాదం కారణంగా.. గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు బుధవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున పార్టీ ఆఫీస్ వారితో మాట్లాడి సమాచారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మత్తి భాస్కరరావు, చందోలు ప్రసాద్, నాగిశెట్టి సుబ్బారావు, గాదె విజయ కుమార్, కొండవీటి యువ కిషోర్, పవన్ నాయుడు బచ్చు, రేపల్లె మల్లికార్జునరావు, జి. గిరిధర్, జి. శేఖర్, జి.ఓంకార్, శ్రీనివాస్ రావు, కాజా నాగేశ్వరరావు, పూలశెట్టి గోపి, లింగమనేని సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.