పలు కుటుంబాలను పరామర్శించిన గాదె

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాల మండలం, దమ్మలపాడు గ్రామంలో జనసైనికుడు నల్లపనేని విజయ్ కుమార్ కు బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కి వెళ్లి అతన్ని, వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి పార్టీ అండగా ఉంటుందని మీరు ధైర్యంగా ఉండాలని వారికి చెప్పటం జరిగింది. అనంతరం నగిరకల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో జనసైనికుడు పాణ్యం సాయి కుమార్ కు బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారిని, వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి పార్టీ అండగా ఉంటుందని మీరు ధైర్యంగా ఉండాలని వారికి చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మారదాసు రామచంద్ర ప్రసాద్ సిరిగిరి శ్రీనివాస్, ఎంపిటిసి సిరిగిరి రామారావు, శిఖా బాలు, నెల్లూరి రాజేష్, గంగరాజు, ఐలమ్ అధినారావన, సూరంసెట్టి సతీష్, శివయ్య, ప్రసాద్, రావుల గోపి, మల్లికార్జునరావు, రామంజి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.