షేక్ ఆసియా కుటుంబాన్ని పరామర్శించిన గాదె

గుంటూరు, చంద్రబాబు నాయుడు చేపట్టిన జనతా వస్త్రాల పంపిణీ మరియు సంక్రాంతి కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటలో మరణించిన నగరంపాలెంలో నివసించే షేక్ ఆసియా కుటుంబ సభ్యులను బుధవారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, భాషా, కరముల, ఏలూరు రాజేష్, మదులాల్, సతీష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.