బాధితులను పరామర్శించిన గాదె

మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం, మించాలపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు పసుపులేటి ప్రసాదు, పసుపులేటి హనుమంతరావు, సింగంశెట్టి మధు, దాసరి చెన్నయ్య రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా దారి మధ్యలో కాపు కాసి జంగమేశ్వర పాడుకు చెందిన ఊరి బండి మన్నయ్య, ఏగయ్య మరియు 20 మంది వైసీపీ గుండాలు జనసేన వాహనం మరియు నాయకులపై దాడిచేసి గాయపరచడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి రానున్న రోజుల్లో వైసిపి గుండాలకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి పులి హరి, నియోజకవర్గ సమన్వయకర్త భూసా రామాంజనేయులు, అధికార ప్రతినిధి నక్షత్రపు ప్రసాద్, మండలాధ్యక్షులు తోటకూర శ్రీనివాసరావు, గంధం మల్లయ్య, గుండెబోయిన సాంబశివరావు కేసనపల్లి కృష్ణబాబు, జనసైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.