తెలుగుదేశం రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శుక్రవారం రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు మూడవరోజు సీతానగరం మండలంలో జరుగుతున్న దీక్షలకు రాజానగరం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.