దీపిక మరణానికి గల కారణాలపై విచారణ జరిపించాలి: సుంకెట మహేష్ బాబు

భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. పిట్టల్లా రాలిపోతున్న విద్యార్థులు ఆత్మహత్యల నిలయంగా భయంకరంగా మారుతున్న వైనం విద్యా సంవత్సరంలో మొదట్లోనే ఇలా జరగడం చాలా బాధాకరం. యునివర్సిటీ అధికారుల నిర్లక్షం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు విద్యార్థుల్లో ఒత్తిడి సరైన భద్రత లోపం కారణంగా ఇలాంటి ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీపిక పియుసి 2 మరణానికి గల కారణాలపై విచారణ జరిపి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేస్తున్నారు. లేని యెడల జన సేన విద్యార్థి విభాగం తరపున పోరాటానికి సిద్ధం చేస్తాం. దీనికి ప్రభుత్వం, యునివర్సిటీ అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.